ఉక్కు కార్మికుల మహా ధర్నా
ABN , First Publish Date - 2021-12-09T00:31:46+05:30 IST
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం ఉద్యోగులు, కార్మికులు పాతగాజువాక జంక్షన్లో మహా ధర్నా చేపట్టారు.
విశాఖ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం ఉద్యోగులు, కార్మికులు పాతగాజువాక జంక్షన్లో మహా ధర్నా చేపట్టారు. కర్మాగారం ఆర్చ్ వద్ద ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 300 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఈ ధర్నాలో పలు రాజకీయ పార్టీలు (బీజేపీ మినహా), ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.