భార్యను ఇంటికి రప్పించేందుకు..కూతురి మెడకు ఉరితాడు వేసి..

ABN , First Publish Date - 2021-08-10T21:29:36+05:30 IST

భార్యను పుట్టింటి నుంచి రప్పించేందుకు కన్నబిడ్డలు చనిపోయారంటూ నాటకమాడిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

భార్యను ఇంటికి రప్పించేందుకు..కూతురి మెడకు ఉరితాడు వేసి..

ముంబై: భార్యను పుట్టింటి నుంచి రప్పించేందుకు కన్నబిడ్డలు చనిపోయారంటూ నాటకమాడిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని తూర్పు మలాడ్ ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను వెనక్కు రప్పించేందుకు నిందితుడు తన పిల్లలు చనిపోయినట్టు ఫోటోలు తీసి భార్యకు పంపించాడని పోలీసులు తెలిపారు. తన కొడుకును నేలపై పడుకోమని చెప్పి, అతడిపై తెల్లటి దుప్పటి కప్పి, పూలమాల వేసి ఫోటోలు తీశాడని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా.. కూతురిని నీళ్ల బకెట్‌పై నిలబెట్టి..ఆమె మెడకు ఉరితాడు తగిలించి మరో ఫొటో తీశాడట. భర్తతో గొడవల కారణంగా భార్య కొంత కాలంగా పుట్టింట్లో ఉంటోందని పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-10T21:29:36+05:30 IST