నవంబరు 1 నుంచి మహా పాదయాత్ర: జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి
ABN , First Publish Date - 2021-10-27T22:28:23+05:30 IST
అమరావతి రాజధాని పరిరక్షణ కోసం నవంబరు 1 నుంచి
గుంటూరు: అమరావతి రాజధాని పరిరక్షణ కోసం నవంబరు 1 నుంచి డిసెంబర్ 17 వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. 675 రోజులుగా రాజధాని రైతులు దీక్షలు చేస్తున్నారని శివారెడ్డి పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. పాదయాత్రపై ఇటీవల డీజీపీకి సమాచారం ఇచ్చామని శివారెడ్డి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర జరిగి తీరుతుందని శివారెడ్డి స్పష్టం చేసారు.