అమరావతి రైతుల పాదయాత్రకు హైదరాబాద్లో మద్దతు..
ABN , First Publish Date - 2021-12-15T16:01:58+05:30 IST
అమరావతి రైతులకు హైదరాబాద్లో ప్రవాసాంధ్రులు మద్దతు తెలుపుతూ ఇవాళ ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్: న్యాయస్థానం టూ దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. బుధవారం రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 45 రోజులపాటు నిర్విరామంగా పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని అమరావతి మద్ధతుదారులు ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. కేపీహెచ్బీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు దీక్షలు చేస్తున్నారన్నారు. అలాగే తాము కూడా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.