మహబూబాబాద్: విద్యుదాఘాతంతో కాడెద్దులు మృతి

ABN , First Publish Date - 2021-06-18T01:38:21+05:30 IST

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ఆశలను నిలువునా చంపివేసింది. నర్సింహులపేట

మహబూబాబాద్: విద్యుదాఘాతంతో కాడెద్దులు మృతి

మహబూబాబాద్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ఆశలను నిలువునా చంపివేసింది. నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో విద్యుదాఘాతంతో మూడు కాడెద్దులు మృత్యువాత పడ్డాయి. దీంతో రైతు రామచంద్రు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇదే మండలంలో గతవారం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఏడు పశువులు బలయ్యాయి. అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేశారు. 

Updated Date - 2021-06-18T01:38:21+05:30 IST