Mahabubabad: కూతుళ్ల పెళ్లి కోసం దాచిన నగదు చోరీ

ABN , First Publish Date - 2021-11-03T17:11:55+05:30 IST

జిల్లాలోని నర్సింహానగర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 33 తులాల బంగారం, రూ.9 లక్షల 70వేల నగదు అపహరణకు గురయ్యాయి.

Mahabubabad: కూతుళ్ల పెళ్లి కోసం దాచిన నగదు చోరీ

మహబూబాబాద్: జిల్లాలోని నర్సింహానగర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 33 తులాల బంగారం, రూ.9 లక్షల 70వేల నగదు అపహరణకు గురయ్యాయి. ఘటనా స్థలంలో దుండగులు కారం చల్లి పరారయ్యారు. కూతురు అంత్యక్రియల కోసం యజమాని బోడ లక్మి కర్ణాటకకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి తాళం పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. మరో ఇద్దరు కూతుళ్ల పెళ్లి కోసం దాచిన నగదు, బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. 

Updated Date - 2021-11-03T17:11:55+05:30 IST