Mahabubabad: వేడి సాంబార్‌లో పడిన బాలుడు మృతి

ABN , First Publish Date - 2022-01-03T14:52:46+05:30 IST

జిల్లాలోని నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వేడి సాంబార్‌లో పడిన బాలుడు మృతి చెందాడు.

Mahabubabad: వేడి సాంబార్‌లో పడిన బాలుడు మృతి

మహబూబాబాద్: జిల్లాలోని నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వేడి సాంబార్‌లో పడిన బాలుడు మృతి చెందాడు. వారం క్రితం ఖమ్మం జిల్లా కాకరవాయిలో మేనమామ ఇరుముడి ఫంక్షన్‌కు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు వేడి వేడి సాంబర్‌లో పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు హుటాహుటాన ఆస్పత్రికి తరలించారు. కాగా వారం రోజుల పాటు చికిత్స పొందిన బాలుడు పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


Updated Date - 2022-01-03T14:52:46+05:30 IST