సినీ సంగీత విభావరి

ABN , First Publish Date - 2021-12-06T05:48:47+05:30 IST

స్థానిక అమరావతి రోడ్డు అన్నదాన సమాజం ఆడిటోరియంలో ఆర్‌ఎస్‌ ఈవెంట్స్‌ (శ్రీ సాయిరాగ మెలోడీస్‌) నిర్వాహకులు మునిపల్లి రమణి ఆధ్వర్యంలో ఘంటసాల శతజయంతి, మహానటి సావిత్రి 86వ జయంతి వేడుకల సంధర్భంగా ఆదివారం సినీ సంగీత విభావరి నిర్వహించారు.

సినీ సంగీత విభావరి
గీతాలాపన చేస్తున్న గాయకులు

గుంటూరు(సాంస్కృతికం), డిసెంబరు 5: స్థానిక అమరావతి రోడ్డు అన్నదాన సమాజం ఆడిటోరియంలో ఆర్‌ఎస్‌ ఈవెంట్స్‌ (శ్రీ సాయిరాగ మెలోడీస్‌) నిర్వాహకులు మునిపల్లి రమణి ఆధ్వర్యంలో ఘంటసాల శతజయంతి, మహానటి సావిత్రి 86వ జయంతి వేడుకల సంధర్భంగా ఆదివారం సినీ సంగీత విభావరి నిర్వహించారు.  మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు, కళ్ళం గ్రూప్స్‌ అధినేత కళ్ళం హరనాథరెడ్డి, జనచైతన్య డైరెక్టర్‌ మాదల రత్నగిరిబాబు, అన్నసత్రం ఈవో డి.ప్రమీలారాణిలు జ్యోతిప్రజ్వలన చేశారు. గాయనీ గాయకులు మునిపల్లి రమణి, మేకల పురుషోత్తమ ప్రసాద్‌, అరికపూడి సాంబశివరావు, పచ్చల విజయలక్ష్మి తమ గాత్రధారణలో పలు గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. కీబోర్డుపై ప్రసాద్‌, ప్యాడ్స్‌పై జోజిబాబు, తబలపై విజయ్‌పాల్‌, వెంకట్‌లు వాద్య సహకారం అందించారు. కార్యక్రమానికి పి.కుమార్‌శేఖర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 


Updated Date - 2021-12-06T05:48:47+05:30 IST