మహారాష్ట్రలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు

ABN , First Publish Date - 2021-06-17T19:07:58+05:30 IST

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫాల్గర్‌లోని బాణాసంచా కేంద్రంలో పేలుళ్లు జరిగాయి.

మహారాష్ట్రలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు

ముంబై: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్‌ జిల్లాలోని వాంఘోస్‌లో గురువారం  బాణాసంచి తయారీ కేంద్రంలో పేలుళ్లు సంభవించాయి. ఒక్కసారిగా భారీ విస్పోటనంతో చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో కార్మికులు ఉన్న‌ట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-06-17T19:07:58+05:30 IST