జనం గుమిగూడకుండా జాతీయ విధానం తీసుకురండి.. మోదీకి ఉద్ధవ్ సూచన

ABN , First Publish Date - 2021-07-16T21:39:12+05:30 IST

కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లో జనం..

జనం గుమిగూడకుండా జాతీయ విధానం తీసుకురండి.. మోదీకి ఉద్ధవ్ సూచన

ముంబై: కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లో జనం ఒకేచోట గమిగూడకుండా చూడాలని, దీనిపై జాతీయ విధానాన్ని కేంద్రం తీసుకురావాలని ప్రధాని మోదీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు. ప్రధాని మోదీ శుక్రవారంనాడు జరిపిన వర్చువల్ మీట్‌లో థాకరే ఈ సూచన చేశారు. కరోనా పరిస్థితిపై మోదీ ఈ సమావేశంలో సమీక్షించారు.


కోవిడ్ మహమ్మారిపై ప్రభుత్వం పోరాటం సాగిస్తున్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడటమనేది ఒక సవాలు అవుతోందని థాకరే అన్నారు. సామాజిక రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లో జనం గుమిగూడకుండా నిరోధించేందుకు ఒక జాతీయ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో సెకెండ్ వేవ్‌తో పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. థర్డ్ వేవ్ వచ్చినట్లయితే ఎదుర్కొనేందుకు కూడా వ్యూహరచన చేస్తున్నామని అన్నారు.

Updated Date - 2021-07-16T21:39:12+05:30 IST