మహారాష్ట్రలో పెరుగుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ బాధితుల సంఖ్య!

ABN , First Publish Date - 2021-08-17T15:38:13+05:30 IST

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మహారాష్ట్రలో పెరుగుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ బాధితుల సంఖ్య!

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటిలో డెల్టా వేరియంట్ కేసులు  అత్యధికంగా ఉంటున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 10 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య 76కు చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో డెల్టా వేరియంట్ కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. 


డెల్టా వేరియంట్‌తో బాధపడుతున్న 76 మంది బాధితులలో 10 మంది కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. మరో 12 మంది ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. డెల్టా వేరియంట్ సోకినవారిలో 19 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మధ్య వయసు కలిగినవారు ఉన్నారు. డెల్టా వేరియంట్‌ను ట్రాక్ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచింది.

Updated Date - 2021-08-17T15:38:13+05:30 IST