విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి దేవాలయంలో ప్రత్యక్షం...

ABN , First Publish Date - 2020-03-26T13:57:28+05:30 IST

విదేశాల నుంచి వచ్చి 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన ఓ వ్యక్తి దేవాలయంలో ప్రత్యక్షమైన ఘటన మహారాష్ట్రలోని కొహ్లాపూర్ పట్టణంలో వెలుగుచూసింది.....

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి దేవాలయంలో ప్రత్యక్షం...

ఆసుపత్రికి తరలింపు 

ముంబై (మహారాష్ట్ర): విదేశాల నుంచి వచ్చి 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన ఓ వ్యక్తి దేవాలయంలో ప్రత్యక్షమైన ఘటన మహారాష్ట్రలోని కొహ్లాపూర్ పట్టణంలో వెలుగుచూసింది. కొహ్లాపూర్ పట్టణానికి ఓ వ్యక్తి విదేశాల నుంచి వచ్చారు.విమానాశ్రయంలో అతన్ని పరీక్షించిన వైద్యులు 14 రోజుల పాటు హోంక్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఇంట్లోనే ఉండాల్సిన వ్యక్తి గుడి పాడ్వా పండుగ సందర్భంగా పూజలు చేసేందుకు దేవాలయానికి వచ్చారు. దేవాలయంలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ప్రత్యక్షం కావడంతో పోలీసులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-03-26T13:57:28+05:30 IST