మహారాష్ట్రలో కరోనా మరణాలతో కల్లోలం.. ఇవాళ ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-06-03T02:44:15+05:30 IST

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఒక్కరోజే...

మహారాష్ట్రలో కరోనా మరణాలతో కల్లోలం.. ఇవాళ ఒక్కరోజే..

ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఒక్కరోజే కరోనా కారణంగా మహారాష్ట్రలో 103 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే 2,287 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా మహారాష్ట్రలో నమోదయినట్లు అధికారులు ప్రకటించారు.


అయితే.. మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఆశాజనకంగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం. కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో మంగళవారం 1225 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 31,333 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72,300కు చేరింది.

Updated Date - 2020-06-03T02:44:15+05:30 IST