మళ్లీ లాక్డౌన్పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-11-23T00:37:15+05:30 IST
రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి సమయంలో...
ముంబై: రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ జనసందోహాలు ఏర్పడ్డాయని, ఈ నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధించడంపై ఆలోచిస్తున్నామని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీస్తున్నాం. ఓ 10 రోజుల పాటు సమీక్ష నిర్వహిస్తాం. కరోనా సెకండ్ వేవ్ కూడా రాబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దానిపై కూడా దృష్టి సారిస్తాం. ఆ తరువాత లాక్డౌన్ విధించాలా..? వద్దా..? అనే దానిపై తుది నిర్ణయం వెలువరిస్తామ’ని అజిత్ పవార్ తెలిపారు.