తల్లి చికిత్స కోసం ఆ పనికి ఒప్పుకుని ఓ గదిలోకి వెళ్లింది.. అక్కడకు వచ్చిన వ్యక్తి ఎవరో తెలిసి కన్నీరుమున్నీరైన 11ఏళ్ల బాలిక!

ABN , First Publish Date - 2021-10-03T15:21:50+05:30 IST

తల్లిని ఎలాగైనా..

తల్లి చికిత్స కోసం ఆ పనికి ఒప్పుకుని ఓ గదిలోకి వెళ్లింది.. అక్కడకు వచ్చిన వ్యక్తి ఎవరో తెలిసి కన్నీరుమున్నీరైన 11ఏళ్ల బాలిక!

ఇంటర్‌నెట్‌డెస్క్: తల్లిని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంది. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే ఉండడంతో ఆ బాలికకు ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలో ఓ మహిళ మాటలు విని ఆ పనికి సరేనని చెప్పింది. ఆ మహిళ చెప్పిన గదికి వెళ్లిన ఆ బాలికకు అక్కడకు వచ్చిన వ్యక్తి ఎవరో తెలిసి కన్నీరుమున్నీరైంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో జరిగింది. 


నాగపూర్ జిల్లాకు చెందిన ఓ 11ఏళ్ల బాలిక తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆస్పత్రి ఖర్చులకోసం వారిదగ్గరున్న డబ్బును మొత్తం ఖర్చు చేశారు. తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలనుకుని డబ్బుల కోసం బంధువులను అడగగా.. ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న ఆ బాలికకు ఓ మహిళ పరిచయమైంది. ‘‘నేను చెప్పినట్టు వింటే నీకు డబ్బులొస్తాయి‘‘అని చెప్పింది. ఆమె మాటలు విని ముందు ఒప్పుకోకున్నా.. తల్లికోసం తన కన్యత్వాన్ని ఐదువేల రూపాయలకు అమ్మకానికి పెట్టింది. 



ఆమె చెప్పినట్టే కరోడిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అక్కడకు వెళ్లిన ఆ బాలికకు ఓ షాకింగ్ సీన్ ఎదురైంది. వచ్చిన వ్యక్తి పోలీస్ ఇన్‌ఫార్మర్ అని తెలిసింది. ఎందుకోసం ఈ పని ఒప్పుకున్నావని అడగ్గా.. విషయం మొత్తం చెప్పి ఏడ్చేసింది. ఆ బాలిక కష్టం చూసిన ఆ వ్యక్తి డబ్బు సహాయం చేశాడు. బాలికను వ్యభిచార రొంపిలోకి దించేందుకు ప్రయత్నించిన మహిళను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



Updated Date - 2021-10-03T15:21:50+05:30 IST