పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడిగా మహేశ్
ABN , First Publish Date - 2021-01-18T09:00:59+05:30 IST
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎ.మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎ.మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. సహాధ్యక్షుడిగా రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులుగా లక్ష్మీనరసింహా యాదవ్, శ్రవణ్కుమార్, కార్యదర్శిగా విజయ్కుమార్, కోశాధికారిగా రాజు, సంయుక్త కార్యదర్శులుగా సురేందర్, మద్దిలేటి, కల్పన ఎన్నికయ్యారు.