ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల!

ABN , First Publish Date - 2022-01-04T01:54:46+05:30 IST

ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ కమిటి సభ్యులు మహేష్ బిగాల సోమవారం ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శూభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్నారై కోఆర్డినేటర్  మహేష్ బిగాల!

ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ కమిటి సభ్యులు మహేష్ బిగాల సోమవారం ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శూభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ దేశాలలో కరోనా పరిస్థితిని వివరించి ప్రవాసీ భారతీయుల యోగక్షేమాల గురించి తెలియజేసారు.  పీవీ శత జయంతి ఉత్సవాల విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి వివిధ దేశాలలో నిర్వహించే ప్రక్రియ గురించి కూడా ఆయన తెలియజేశారు. అమెరికా పర్యటన ముగించుకున్న మహేష్ బిగాల అక్కడ వివరాలను తెలియజేశారు. అంతేకాకుండా.. అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో ఈ ఏడాది మే 22న జరగనున్న మాజీ ప్రధాని దివంగ‌త పి.వి.న‌ర‌సింహారావు విగ్రహావిష్కరణకు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు. కాగా.. ఈ ఆహ్వానంపై ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించారు. 

Updated Date - 2022-01-04T01:54:46+05:30 IST