కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడిగా మహేశ్వర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-09-26T09:49:37+05:30 IST

కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి ఉపాధ్యక్ష పదవికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా జక్కుల మహేశ్వర్‌ రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడిగా మహేశ్వర్‌ రెడ్డి

పేరును ప్రతిపాదించిన మంత్రి తలసాని


మారేడ్‌పల్లి సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి ఉపాధ్యక్ష పదవికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా జక్కుల మహేశ్వర్‌ రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రతిపాదించారు. శుక్రవారం వెస్ట్‌ మారెడుపల్లిలోని ఆయన నివాసంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌ రెడ్డి, సదా కేశవ రెడ్డి, అనిత ప్రభాకర్‌, నళిని కిర ణ్‌, పాండు యాదవ్‌, భాగ్యశ్రీశ్యామ్‌, లోకనాథమ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఉపాధ్యక్షుడి పదవికి జక్కుల మహేశ్వర్‌ రెడ్డి పేరును మంత్రి తలసాని శ్రానివాస్‌ యాదవ్‌ ప్రతిపాదించగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 

Updated Date - 2020-09-26T09:49:37+05:30 IST