గూడ్స్‌ రైలు ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2021-05-12T05:34:11+05:30 IST

నగరంలోని ఎస్‌2 సమీపంలో చెన్నై వైపు వెళ్లే గూడ్స్‌ రైలు మంగళవారం పట్టాలు దాటుతున్న మహిళను ఢీ కోనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

గూడ్స్‌ రైలు ఢీకొని మహిళ మృతి

నెల్లూరు(క్రైం) : మే 11: నగరంలోని ఎస్‌2 సమీపంలో చెన్నై వైపు వెళ్లే గూడ్స్‌ రైలు మంగళవారం పట్టాలు దాటుతున్న మహిళను ఢీ కోనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్‌ఐ జి. మాలకొండయ్య సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మహిళ వివరాలు లభ్యం కాలేదు. మృతి చెందిన మహిళకు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉండొచ్చననీ, తెలుపు , పసుపు రంగు చీర, సిమెంట్‌ రంగు జాకెట్‌ ధరించి ఉందనీ ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి పోస్టుమార్టరం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు.

Updated Date - 2021-05-12T05:34:11+05:30 IST