వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-18T05:22:59+05:30 IST
వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రమైన కాకుమాను శివారులో ఆదివారం చోటు చేసుకుంది.
కాకుమాను, జనవరి 17: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రమైన కాకుమాను శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సౌందర్రాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. యడ్లపాడు గ్రామానికి చెందిన వివాహిత ఉప్పరెట్ల సునీత(28) అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అదే విషయంతో భర్త అనేకసార్లు హెచ్చరించడంతో సునీత, వేణుగోపాల్ కలిసి కాకుమాను శివారులో కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తాగారు. సునీత అక్కడకక్కడే మృతి చెందగా, వేణుగోపాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతనిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సౌందర్రాజన్ తెలిపారు.