బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు... కొనసాగుతున్న రక్షణ చర్యలు!

ABN , First Publish Date - 2020-12-03T14:10:41+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా పరిధిలోని బుధౌరా గ్రామంలో తెరిచివున్న బోరు బావిలో నాలుగేళ్ల బాలుడు పడిపోయాడు.

బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు... కొనసాగుతున్న రక్షణ చర్యలు!

మహోబా: ఉత్తరప్రదేశ్‌లోని మహోబా పరిధిలోని బుధౌరా గ్రామంలో తెరిచివున్న బోరు బావిలో నాలుగేళ్ల బాలుడు పడిపోయాడు. విషయం తెలుసుకున్న జిల్లా పరిపాలనా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసింది. బోర్‌వెల్‌లో చిక్కుకున్న బాలునికి పైప్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. 


ఈ ఉదంతంపై మహోబా జిల్లా అధికారి సత్యేంద్ర కుమార్ మాట్లాడుతూ బోరు బావిలో నుంచి బాలుని ఏడుపు వినిపిస్తున్నదన్నారు. ఆ బాలుడు 25 నుంచి 30 అడుగుల లోతున ఉన్నాడని తెలుస్తున్నదన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయని తెలిపారు. బాలుడిని కాపాడేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నామని తెలిపారు. ఈ పనుల కోసం మూడు జేసీబీ యంత్రాలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.


Updated Date - 2020-12-03T14:10:41+05:30 IST