మైలవరంలోనే తేల్చుకుందాం రండి

ABN , First Publish Date - 2020-08-14T14:12:04+05:30 IST

అవినీతి, అభివృద్ధిపై మైలవరంలోనే తేల్చుకునేందుకు..

మైలవరంలోనే తేల్చుకుందాం రండి

ఉమాకు ధైర్యం ఉంటే వసంత సవాల్‌ను స్వీకరించాలి : వైసీపీ


మైలవరం(కృష్ణా): అవినీతి, అభివృద్ధిపై మైలవరంలోనే తేల్చుకునేందుకు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంసిద్ధంగా ఉండాలని వైసీపీ నేతలు అన్నారు. మైలవరం, జి.కొండూరు, కొండపల్లిలలో వైసీపీ నేతలు గురువారం విలేకర్ల సమావేశాల్లో మాట్లాడారు. ఎమ్మెల్యే వసంత మైలవరంలో తేల్చుకుందామని చేసిన సవాల్‌ను ఉమా స్వీకరించకుండా తాడేపల్లి రాజప్రసాదం వద్ద తేల్చుకుందాం అనడాన్ని వారు తప్పుపట్టారు. మైలవరం విషయం కాబట్టి మైలవరంలోనే తేల్చుకోవాలని ఇక్కడ తేల్చుకునేందుకు ఉమా ఎందుకు భయపడుతున్నాడో చెప్పా లన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ పామర్తి శ్రీనివాసరావు, రహీమ్‌, ఎన్‌.మారేష్‌, గురవయ్య, కాజ బ్రహ్మయ్య, మందా జక్రధరరావు, నెల్లూరి లీలా శ్రీనివాసరావు, చుండూరు విష్ణు, పసుపులేటి రమేష్‌, తమటం వెంకట్రామయ్య  పాల్గొన్నారు.  


Updated Date - 2020-08-14T14:12:04+05:30 IST