బాధ్యతలు స్వీకరించిన మేయర్
ABN , First Publish Date - 2021-05-14T06:11:45+05:30 IST
ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజ గురువారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
తొలిఫైలుపై సంతకం
హాజరైన మంత్రి పువ్వాడ
ఖమ్మం కార్పొరేషన్, మే 13: ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజ గురువారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ తెచ్చిన తొలిఫైల్పై ఆమె సంతకం చేశారు. ఈ సందర్భంగా మేయర్ సర్వమత ప్రార్థనలు జరిపి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మేయర్గా బాధ్యతలు స్వీకరించిన నీరజను, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారాను సన్మానించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేసి, అభివృద్ధిలో ఖమ్మం కార్పొరేషన్ను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలన్నారు. అభివృద్ధి పనులకు తాను బాసటగా ఉంటానని మంత్రి పువ్వాడ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.