మనకు బంగారమొచ్చేది ఎక్కువగా ఎక్కడినుంచంటే...
ABN , First Publish Date - 2021-07-19T00:56:36+05:30 IST
భారత్ దిగుమతి చేసుకుంటున్న బంగారంలో దాదాపు సగం వరకు స్విట్జర్లాండ్ నుంచే వస్తోంది.
ముంబై : భారత్ దిగుమతి చేసుకుంటున్న బంగారంలో దాదాపు సగం వరకు స్విట్జర్లాండ్ నుంచే వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం భారత్ మొత్తం 34.6 బిలియన్ డాలర్లు విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 16.3 బిలియన్ డాలర్ల బంగారం స్విట్జర్లాండ్ నుంచే వచ్చింది. కాగా... 2020-21 లో భారత్ 6.4 బిలియన్ డాలర్ల మేర విలువూన బంగారాన్ని అధికంగా దిగుమతి చేసుకుంది. ఇక స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు కూడా 7.8 శాతానికి(18.2 బిలియన్ డాలర్లు)కు చేరాయి.