పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేయండి: డీఈవో
ABN , First Publish Date - 2021-08-03T06:50:14+05:30 IST
పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఈవో పురుషోత్తం ఆదేశించారు.
చిత్తూరు (సెంట్రల్), ఆగస్టు 2: పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఈవో పురుషోత్తం ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో ఎంఈవో, హెచ్ఎం సమీక్షించారు. జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థుల సమీకరణతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలన్నారు. చిత్తూరు ఎంఈవో సెల్వరాజ్, నగరంలోని మున్సిపల్, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.