పథకాలు అందకుంటే ఫిర్యాదు చేయండి
ABN , First Publish Date - 2021-08-03T06:02:05+05:30 IST
ప్రభుత్వ పథకాలు అందని పక్షంలో స్పందనలో ఫిర్యాదు చేయవచ్చునని సబ్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు.
నరసాపురం, ఆగస్టు 2: ప్రభుత్వ పథకాలు అందని పక్షంలో స్పందనలో ఫిర్యాదు చేయవచ్చునని సబ్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ అధికారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతి అర్జీని అధికారులు పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కరించకుంటే అర్జీదా రులకు కాలణం తెలపాలన్నారు. అనంతరం ప్రజల నుంచి 47 వినతులను సబ్ కలెక్టర్ స్వీకరించారు. వాటిలో పట్టణంలోని 6 వార్డుకు చెందిన బాల సూర్యకుమారి వితంతు పింఛన్ ఇప్పించాలని, కాళ్ళ మండలం దొడ్డనపూడి గ్రామానికి చెందిన వీరన్న వృద్దాప్య ఫించన్ కోసం, వీర వాసరం మండలం నందమూరిగరువుకు చెందిన పరమేశ్వరి ఇంటి స్థలం ఇవ్వాలని, నరసాపురం మండలం చామకూరిపాలెంకు చెందిన సత్యనారాయణ విద్యా దీవెన రావడం లేదని, పాలకొల్లు మండలం గోరింటాడకు చెందిన వి. కృష్ణారావు పొలం సరిహద్దు వివాదంపై అర్జీలను అందజేశారు. సబ్ కలెక్టర్ ఈ సమస్యల్ని పరి ష్కారానికి అఽధికారులను ఆదేశించారు. పలుశాఖల అధికారులు ఉన్నారు.