గిట్టుబాటు ధరపై చట్టం చేయండి

ABN , First Publish Date - 2021-10-22T05:25:07+05:30 IST

రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు గ్యారంటీ చట్టం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహన్‌రావు, అభ్యుద య రైతు ఖండాపు ప్రసాదరావు డిమాండ్‌ చేశారు.

గిట్టుబాటు ధరపై చట్టం చేయండి
మాట్లాడుతున్న రైతు సంఘ నాయకులు


పాలకొండ రూరల్‌: రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు గ్యారంటీ చట్టం చేయాలని  ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహన్‌రావు, అభ్యుద య రైతు ఖండాపు ప్రసాదరావు డిమాండ్‌ చేశారు. గురువారం పాలకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌భేరి ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని కోరారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన అణచివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అప్పలనాయుడు, రామినాయుడు పాల్గొన్నారు.

  

 


Updated Date - 2021-10-22T05:25:07+05:30 IST