శంఖారావాన్ని విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2021-04-11T05:40:01+05:30 IST
విశాఖపట్నంలో ఈ నెల 18న నిర్వహించనున్న కార్మిక, రైతు శంఖారావాన్ని విజయవంతం చేయాలని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య పిలుపునిచ్చారు.
గుజరాతీపేట:విశాఖపట్నంలో ఈ నెల 18న నిర్వహించనున్న కార్మిక, రైతు శంఖారావాన్ని విజయవంతం చేయాలని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవే టీకరణను ఆపాలని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శంఖారావాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు గోవిందరావు, తేజేశ్వరరావు, మోహనరావు, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.