లోకేశ్ పర్యటన విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2021-10-17T06:26:03+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 20న అనకాపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరావు శ్రేణులకు పిలుపునిచ్చారు.
టీడీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరావు
ఎలమంచిలి, అక్టోబరు 16: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 20న అనకాపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరావు శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఎలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, నేతలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ద మాట్లాడుతూ అనకాపల్లిలో కార్యక్రమాలకు లోకేశ్ తొలిసారిగా హాజరు కానున్నారన్నారు. ప్రభుత్వతీరుతో ప్రజలపై మోయలేని ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో అనుభవజ్జుడైన చంద్రబాబు అవసరం ఉందని ప్రగడ నాగేశ్వరావు అనానరు. కార్యక్రమంలో పట్టణ అద్యక్ష, కార్యదర్శులు గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, నేతలు కోట్ని బాలజీ, దూళి రంగనాయకులు, కొలుకులూరి విజయ్ బాబు, ఇత్తంశెట్టి రాజు, దిన్బాబు, కాండ్రకోట చిరంజీవి, ఆర్ఎస్. నాగేశ్వరావు, దాడి ముసిలినాయుడు, రాజాన వెంకునాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.