ఎమ్మార్పీఎస్ సదస్సును విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2021-02-25T04:30:42+05:30 IST
ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బెలూం గుహల్లో మార్చి 8వ నిర్వహించనున్న మహిళల సదస్సును విజయవంతం చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ మండల యూత్ అధ్యక్షుడు పవన్కుమార్ మాదిగ పిలుపునిచ్చారు.
ముద్దనూరు ఫిబ్రవరి 24: ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బెలూం గుహల్లో మార్చి 8వ నిర్వహించనున్న మహిళల సదస్సును విజయవంతం చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ మండల యూత్ అధ్యక్షుడు పవన్కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. మం డల పరిధిలోని యామవరం గ్రామంలో బుధవారం కరపత్రాలను విడుదల చేశారు. బెలూం గుహల్లో జరిగే మహిళల సదస్సుకు భారీ ఎత్తున దళిత మహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామక్క, అరుణ, జయలక్షుమ్మ, లక్ష్మీదేవి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.