తెలుగుగంగ నీటిని సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-07-30T04:52:57+05:30 IST

తెలుగుగంగ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అగ్రికల్చర్‌ బోర్డ్డు ఛైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలుగుగంగ నీటిని సద్వినియోగం చేసుకోండి
కాల్వలో నీటిప్రవాహాన్ని పరిశీలిస్తున్న ప్రసాద్‌రెడ్డి

కాశినాయన జూలై 29: తెలుగుగంగ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అగ్రికల్చర్‌ బోర్డ్డు ఛైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక రైతులతో కలిసి ఇటుకులపాడు వద్ద గంగ ఎడ మ కాల్వ నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ డ్యా మ్‌లో సరిపడా నీరు నిల్వపెట్టి సకాలంలో కాల్వలకు నీటిని విడుదల చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. మాజీ జడ్పీటీసీ వెంకటసుబ్బయ్యఆచారి, వైసీపీ నేతలు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:52:57+05:30 IST