మంచిర్యాలలో బంగారు బిస్కెట్ల తయారీ కలకలం
ABN , First Publish Date - 2021-07-27T23:06:52+05:30 IST
జిల్లాలోని చెన్నూరు పట్టణంలో బంగారు బిస్కెట్ల తయారీ కలకలం
మంచిర్యాల: జిల్లాలోని చెన్నూరు పట్టణంలో బంగారు బిస్కెట్ల తయారీ కలకలం సృష్టించింది. హాల్మార్క్ అచ్చులతో బిస్కెట్లు తయారు చేసి తక్కువ ధరకు పలువురు వ్యాపారులు అమ్ముతున్నారు. దీనిపై జిల్లా స్వర్ణకార సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నాణ్యత లేకుండా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్వర్ణకార సంఘం నేతలు డిమాండ్ చేసారు.