2017నాటి వరకట్నం కేసులో మల్కాజిగిరి కోర్టు తాజాగా తీర్పు

ABN , First Publish Date - 2020-07-01T23:13:02+05:30 IST

వరకట్న వేధింపుల కేసులో అత్తమామలకు మల్కాజిగిరి కోర్టు సంవత్సరం జైలు శిక్ష, ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది.

2017నాటి వరకట్నం కేసులో మల్కాజిగిరి కోర్టు తాజాగా తీర్పు

మల్కాజిగిరి: వరకట్న వేధింపుల కేసులో అత్తమామలకు మల్కాజిగిరి కోర్టు సంవత్సరం జైలు శిక్ష, ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. 2017 నాటి ఈ కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అదనపు కట్నం తేవాలంటూ అత్తమామలు, భర్త వేధిస్తున్నారంటూ 2017లో కుషాయిగూడ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భర్త తెల్ల శ్రీకృష్ణ, అత్త సుగుణ, మామ శ్రీనాథ్‌లను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. భర్త శ్రీకృష్ణ అమెరికాలో ఉండడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, అత్తమామలకు ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించింది.

Updated Date - 2020-07-01T23:13:02+05:30 IST