మైసమ్మగూడలో మల్లన్న కల్యాణం
ABN , First Publish Date - 2020-09-29T07:01:23+05:30 IST
గుండ్లపోచంపల్లి మున్సిపల్ మైసమ్మగూడ గుట్టలపై గల మల్లన్న ఆలయంలో సోమవారం స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు
మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపల్ మైసమ్మగూడ గుట్టలపై గల మల్లన్న ఆలయంలో సోమవారం స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రతీయేటా నాలుగురోజుల పాటు గుట్టపై గల అమ్మవార్ల కల్యాణోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. చిత్తారమ్మ జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివా్సరెడ్డి దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కండ్లకోయ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వెంకటేశ్ముదిరాజ్, నాయకులు గౌస్ పాల్గొన్నారు.