8 నుంచి మల్లన్న దర్శనం?
ABN , First Publish Date - 2020-06-01T09:01:33+05:30 IST
భక్తులకు శ్రీశైల మల్లన్న దర్శన భాగ్యం త్వరలోనే కలిగే అవకాశం కనిపిస్తోంది. జూన్ 8 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది.
శ్రీశైలం, మే 31: భక్తులకు శ్రీశైల మల్లన్న దర్శన భాగ్యం త్వరలోనే కలిగే అవకాశం కనిపిస్తోంది. జూన్ 8 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5వ విడత లాక్డౌన్ నిబంధనల్లో ఆలయాల సందర్శనకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరో వారం రోజుల్లో శ్రీగిరిపై భక్తుల సందడి కనిపించే అవకాశ ముంది. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తారని తెలిసింది. భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లలో మార్కింగ్ ఇచ్చారు.