ఘట్కేసర్లో ప్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-04T20:12:53+05:30 IST
ఘట్కేసర్లో ప్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం
మేడ్చల్ మల్కాజిగిరి : రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఘట్కేసర్ ప్లైఓవర్ వంతెన నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఇవాళ ఘట్కేసర్లో ప్లైఓవర్ వంతెన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం బాధితులకు స్థలంతో పాటు, కొంత మొత్తాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తుందని, దీనికి బాధితులు అంగీకారం తెలుపడంతో నిర్మాణ పనులు ఆటంకాలు లేకుండా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయితే కొండాపూర్, కీసర, శామీర్పేట్, మేడ్చల్ వరకు వెళ్లే వాహన దారులకు సౌకర్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ప్లైఓవర్ వంతెన నిర్మాణ సమయంలో స్థలాలు నష్టపోయిన బాధితులకు సరైన న్యాయం జరుగకపోవడంతో కొంత మంది కోర్టుకు వెళ్లడంతో ఈ పనులు నిలిచిపోయాయన్నారు.