AP: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామికి పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-22T13:13:39+05:30 IST

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్‎లో వేచివున్నారు

AP: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామికి పెరిగిన భక్తుల రద్దీ

కర్నూలు: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్‎లో వేచివున్నారు. ఆలయ క్యూలైన్లలో శివవనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. శ్రీశైలం గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను మహిళలు వెలిగించి నోములు నోచుకుంటున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీశైలంలోని పాతాళగంగలో కార్తీక పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు.

Updated Date - 2021-11-22T13:13:39+05:30 IST