మాల్యా అప్పగింత మరింత జాప్యం

ABN , First Publish Date - 2020-06-05T06:11:45+05:30 IST

పరారీ నేరగాడు విజయ్‌ మాల్యా అప్పగింత మరి కొంత జాప్యం కావచ్చునని బ్రిటన్‌ తేల్చి చెప్పింది. చట్టపరమైన సమస్య ఒకటి పరిష్కారం కావలసిఉన్నదంటూ అప్పటివరకు అప్పగింత ఆలస్యం కాక తప్పదని బ్రిటిష్‌ ప్రభుత్వం తెలియచేసింది...

మాల్యా అప్పగింత మరింత జాప్యం

న్యూఢిల్లీ: పరారీ నేరగాడు విజయ్‌ మాల్యా అప్పగింత మరి కొంత జాప్యం కావచ్చునని బ్రిటన్‌ తేల్చి చెప్పింది.  చట్టపరమైన సమస్య ఒకటి పరిష్కారం కావలసిఉన్నదంటూ అప్పటివరకు అప్పగింత ఆలస్యం కాక తప్పదని బ్రిటిష్‌ ప్రభుత్వం తెలియచేసింది. ఎంత కాలంలో ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నది తాము చెప్పలేమని రాయబార కార్యాలయం ప్రతినిధి ఒకరన్నారు. అయితే ఆ సమస్య ఏమిటనేది తాము వెల్లడించలేమని, అది అత్యంత గోప్యమని ఆయన చెప్పారు. తన అప్పగింతను సవాలు చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఏ క్షణాన అయినా మాల్యా భారత్‌కు రావచ్చునంటూ కొన్ని వర్గాల్లో సాగిన ఊహాగానాలు దీనితో తెర పడింది.  


Updated Date - 2020-06-05T06:11:45+05:30 IST