మాల్యా దివాలా కోరే: యూకే హైకోర్టు
ABN , First Publish Date - 2021-07-27T05:50:41+05:30 IST
విజయ్ మాల్యా ముమ్మాటికీ ‘దివాలా’కోరని బ్రిటిష్ కోర్టు స్పష్టం
లండన్: విజయ్ మాల్యా ముమ్మాటికీ ‘దివాలా’కోరని బ్రిటిష్ కోర్టు స్పష్టం చేసింది. లండన్లోని చీఫ్ ఇన్సాల్వెన్సీస్ అండ్ కంపెనీస్ కోర్టు (ఐసీసీ) న్యాయమూర్తి మైకేల్ బ్రిగ్స్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎస్బీఐ నాయకత్వంలోని 13 భారతీయ బ్యాంకులు విదేశాల్లోని మాల్యా ఆస్తుల స్వాధీనానికి చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించి భారతీయ కోర్టుల్లో కేసు నడుస్తున్నందున విచారణపై స్టే ఇవ్వడంతో పాటు విచారణ వాయిదా వేయాలని మాల్యా న్యాయవాదులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సముచిత సమయంలో మాల్యా అప్పులు పూర్తిగా చెల్లిస్తారనే నమ్మకం లేనందున ఈ కేసులో స్టే ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.