18 రాష్ట్రాల సీఎంలకు మమతా బెనర్జీ వినతి..

ABN , First Publish Date - 2020-03-27T01:32:57+05:30 IST

కరోనా ఆంక్షల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన బెంగాలీలను ఆదోకోవాలని ఆయా రాష్ట్రాల సీఎంలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.

18 రాష్ట్రాల సీఎంలకు మమతా బెనర్జీ వినతి..

కోలకతా: కరోనా ఆంక్షల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన బెంగాలీలను ఆదుకోవాలని ఆయా రాష్ట్రాల సీఎంలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఈ మేరకు 18 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. ఇలా అవస్థ పడుతున్న బెంగాలీలకు అవసరమైనవి సమకూర్చాలని మమత విన్నవించారు.


‘బెంగాల్‌కు చెందిన అనేక మంది వర్కర్లు వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయారు. దేశ మొత్తం లాక్ డౌన్ కావడంతో వారు స్వరాష్ట్రానికి రాలేకపోతున్నారు. తమకు సహాయం చేయండి అంటూ వారందరూ బెంగాల్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీరిలో అధిక శాతం మంది 10 నుంచి 50 మంది సభ్యులున్న బృందాలుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరికీ బెంగాల్ ప్రభుత్వం సహాయం చేయడం సాధ్యం కాదు కాబట్టి స్థానిక పాలనా యంత్రాంగం వీరిని ఆదుకోవాలని సూచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని మమత లేఖ రాశారు.




Updated Date - 2020-03-27T01:32:57+05:30 IST