మనం బలపడదాం : మమత

ABN , First Publish Date - 2021-08-15T21:19:13+05:30 IST

స్వేచ్ఛ గొంతు నులిమే శక్తులకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారిని

మనం బలపడదాం : మమత

కోల్‌కతా : స్వేచ్ఛ గొంతు నులిమే శక్తులకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారిని బలపరచాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పిలుపునిచ్చారు. శౌర్య, పరాక్రమాలను ప్రదర్శించిన పోలీసులకు పురస్కారాలను ప్రదానం చేశారు. పోలీసు స్మారకం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా రెడ్ రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించలేదు. 


మమత బెనర్జీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అణచివేసే లక్ష్యంతో పని చేసే అన్ని శక్తులకు వ్యతిరేకంగా, 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మనమంతా కలిసి మన గళాలను బలోపేతం చేసుకుందాం’’ అని చెప్పారు.  ఈ రోజు కోసం సుదీర్ఘ పోరాటం చేసి, కఠోరంగా యుద్ధం చేసినవారి త్యాగాలను మనం ఎన్నటికీ మర్చిపోబోమని తెలిపారు. సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన శకటాలను 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రదర్శించారు. 


Updated Date - 2021-08-15T21:19:13+05:30 IST