సీఎం మమతతో ప్రశాంత్ కిశోర్ సుదీర్ఘ మంతనాలు

ABN , First Publish Date - 2021-07-10T17:37:19+05:30 IST

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో

సీఎం మమతతో ప్రశాంత్ కిశోర్ సుదీర్ఘ మంతనాలు

కోల్‌కతా: West Bengal పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లోనూ సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో టీఎంసీకి దిశానిర్దేశం చేసిన ప్రశాంత్ కిశోర్ సీఎం మమతా బెనర్జీలు తాజాగా మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. 


ఈ సమావేశం మమతా బెనర్జీ ఇంటిలో జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు, చేర్పుల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు భోగట్టా. జిల్లాల వారీగా పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్టంలో పార్టీ విజయం సాధించిన అనంతరం మమతా బెనర్జీ దేశ రాజకీయాలపై అపరిమితమైన ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రశాంత్ కిశోర్ సారధ్యంలో బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు చివరివారం నుంచి ఇందుకు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభ కానున్నాయని తెలుస్తోంది. 

Updated Date - 2021-07-10T17:37:19+05:30 IST