నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం మమత

ABN , First Publish Date - 2021-03-05T17:30:24+05:30 IST

సీఎం మమతా బెనర్జీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.

నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం మమత

కోల్‌కతా : సీఎం మమతా బెనర్జీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. మొత్తం 294 స్థానాల అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుండటం విశేషం. అయితే ఇందులో ఎక్కువ మంది మహిళలకు, యువకులకు విశేష ప్రాధాన్యం కల్పించారని వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలోని యువత బీజేపీ వైపు వెళ్లకుండా కట్టడి చేసే భాగంలోనే ఎక్కువ మంది యువతకు టిక్కెట్లు ఇస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సీఎం మమతా బెనర్జీ మాత్రం ఈసారి నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి తృణమూల్ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైంది. ముఖ్య నేతలందరితోనూ సీఎం మమత సమావేశమై, వారి ఆలోచనలను, నిర్ణయాలను తీసుకున్నారు. వీటి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక కూడా జరిగినట్లు సమాచారం. అయితే 80 సంవత్సరాల వయస్సు పైబడిన వారెవ్వరికీ టిక్కెట్లు ఇవ్వకూడదని అధిష్ఠానం నిర్ణయించుకుంది. దాదాపు 75 మంది సిట్టింగ్‌లకు ఈసారి మమత టిక్కెట్లు ఇవ్వడం లేదని సమాచారం.

Updated Date - 2021-03-05T17:30:24+05:30 IST