టిక్‌టాక్ చూస్తుండగా ఓ వీడియోలో కనిపించిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టి..

ABN , First Publish Date - 2020-05-19T18:24:04+05:30 IST

ఇంటి నుంచి జాడ తెలియకుండా వెళ్లిన ఓ వ్యక్తి రెండు సంవత్సరాల తరువాత టిక్‌టాక్‌ వీడియోల్లో ప్రత్యక్షమయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌ గ్రామానికి చెందిన రొడ్డా వెంకటేశ్వర్లు అనే మూగ వ్యక్తి రెండు సంవత్సరాల

టిక్‌టాక్ చూస్తుండగా ఓ వీడియోలో కనిపించిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టి..

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి టిక్‌టాక్‌లో ప్రత్యక్షం

పంజాబ్‌లో ఉన్నట్లు గుర్తించిన యువకుడు


బూర్గంపాడు (ఖమ్మం): ఇంటి నుంచి జాడ తెలియకుండా వెళ్లిన ఓ వ్యక్తి రెండు సంవత్సరాల తరువాత టిక్‌టాక్‌ వీడియోల్లో ప్రత్యక్షమయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌ గ్రామానికి చెందిన రొడ్డా వెంకటేశ్వర్లు అనే మూగ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం కూలీ పని కోసం పాల్వంచ వెళ్లాడు. ఆ తరువాత ఇంటికి చేరలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు వారం పాటు చుట్టుపక్కల , బంధువుల ఇళ్లల్లోనూ వెతికారు. అయినా జాడ లభించక పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లుకి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


ఇదే గ్రామానికి చెందిన కలసాని నాగేంద్రబాబు అనే యువకుడు సోమవారం తన ఫోన్‌లో టిక్‌టాక్‌ వీడియోలు చూస్తుండగా వెంకటేశ్వర్లు కనిపించాడు. అతడిని గుర్తుపట్టిన నాగేంద్రబాబు విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అతడు పంజాబ్‌లో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపాడు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని వెంకటేశ్వర్లు ఇంటికి చేరేలా సహకారం అందించాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-05-19T18:24:04+05:30 IST