పొరపాటున మిత్రుని మరణం.. బాధతో పురుగుల మందు తాగి ముగ్గురి ఆత్మహత్య!

ABN , First Publish Date - 2021-04-06T10:28:27+05:30 IST

స్నేహితులతో కలిసి వేటకు వెళ్లిన ఓ యువకుడు పొరబాటున ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాధ తట్టుకోలేకపోయి బృందంలోని మరో ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

పొరపాటున మిత్రుని మరణం.. బాధతో పురుగుల మందు తాగి ముగ్గురి ఆత్మహత్య!

భిలంగన: స్నేహితులతో కలిసి వేటకు వెళ్లిన ఓ యువకుడు పొరబాటున ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాధ తట్టుకోలేకపోయి బృందంలోని మరో ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. భిలంగన ప్రాంతానికి చెందిన ఏడుగురు మిత్రులు దగ్గరలోని అడవిలో వేటకు వెళ్లారు. రాజీవ్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. అడవిలో వెళ్తుండగా రాజీవ్ కాలు జారి కింద పడ్డాడు. ఆ సమయంలో అతని భుజానికి తగిలించుకొని ఉన్న తుపాకీ పేలి ఆ బృందంలోని సంతోష్‌కు తూటా తగిలింది. రక్తపు మడుగులో పడిపోయిన సంతోష్‌ను చూసిన రాజీవ్ భయంతో పారిపోయాడు.


ఇదంతా గమనించిన శోభన్, పంకజ్, అర్జున్ అనే ముగ్గురు మిత్రులు బాధతో పురుగుల మందు తాగారు. మిగిలిన ఇద్దరు రాహుల్, సుమిత్ వెంటనే దగ్గరలోని గ్రామస్థులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి చూసేసరికి సంతోష్ మరణించి ఉన్నాడు. శోభన్, పంకజ్, అర్జున్‌లను బాలేశ్వర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పించగా.. అర్జున్, పంకజ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ శోభన్ కూడా మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-06T10:28:27+05:30 IST