భార్య, ప్రియుడితో కలిసి దారుణం...

ABN , First Publish Date - 2020-10-29T15:25:14+05:30 IST

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య బాగోతం...

భార్య, ప్రియుడితో కలిసి దారుణం...

భర్తను చంపి శవాన్ని ప్రియుడి పడకగదిలో పూడ్చిపెట్టి...

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య బాగోతం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసింది. కోల్‌కతా నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని నార్త్ 24పరగణాస్ జిల్లా బొంగావ్ గ్రామ నివాసి రామకృష్ణ సర్కారు(42), స్వప్న(38)లు భార్యాభర్తలు. స్వప్న ప్రియుడు సుజిత్ దాస్ తోకలిసి భర్త రామకృష్ణను హతమార్చింది. రామకృష్ణను కత్తితో పొడిచి చంపి మృతదేహాన్ని ప్రియుడు సుజిత్ దాస్ పడకగదిలో గుంత తవ్వి పూడ్చిపెట్టారని పోలీసులు చెప్పారు. స్వప్న సుజిత్ దాస్ లో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను హతమార్చిందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని వెలికితీయగా శరీరంపై కత్తి గాయాలున్నాయి. హంతకులు స్వప్న, సుజిత్ దాస్ లను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడి ఇంటి ముందు రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు తనిఖీలు చేయగా పడకగదిలో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చి పెట్టారని తేలిందని పోలీసులు వివరించారు.

Updated Date - 2020-10-29T15:25:14+05:30 IST