ఏటీయం వివరాలివ్వలేదని.. మహిళపై అత్యాచారం!

ABN , First Publish Date - 2020-05-24T02:27:06+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఇంటిలో పడిన ఓ దొంగకు ఏటీయం వివరాలివ్వలేదని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఏటీయం వివరాలివ్వలేదని.. మహిళపై అత్యాచారం!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఇంటిలో పడిన ఓ దొంగకు ఏటీయం వివరాలివ్వలేదని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి ఇంటి బాల్కనీలో కూర్చొని మొబైల్ వాడుతోంది. అదే సమయంలో ఓ 23ఏళ్ల కుర్రాడు దొంగతనం చేయడానికి ఆ ఇంటిలో చొరబడ్డాడు. ఇంటిలోని విలువైన వస్తువులు, డబ్బు తనకు అప్పగించాలని ఆమెను బెదిరించాడు. ఆపై ఆమె బ్యాంకు ఏటీయం కార్డులు తీసుకొని వాటి పిన్ నంబర్ చెప్పాలని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె నిరాకరించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను పారిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. సదరు దొంగ తనపై అత్యాచారం చేయడమే కాకుండా, గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో 23 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-05-24T02:27:06+05:30 IST