కట్నం కోసం నవ వధువును చంపిన భర్త

ABN , First Publish Date - 2021-06-18T11:30:53+05:30 IST

కట్నం కోసం నవ వధువును చంపిన కసాయి భర్త బాగోతం....

కట్నం కోసం నవ వధువును చంపిన భర్త

న్యూఢిల్లీ : కట్నం కోసం నవ వధువును చంపిన కసాయి భర్త బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని మైదాంగర్హి ప్రాంతానికి చెందిన కుల్దీప్ సింగ్ రాణా(29)కు ఉత్తరాఖండ్ రాస్ట్రంలోని గోలాపర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతితో ఈ ఏడాది ఏప్రిల్ 26వతేదీన వివాహమైంది. రాణా కాంట్రాక్టరు వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. కట్నం కోసం భార్యతో గొడవపడి ఆమెను పడకగదిలోనే చంపాడు. పడకగదిలో భార్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. నవ వధువు మృతదేహంపై కమిలిన గాయాలున్నాయి. కట్నం కోసమే భార్యను భర్త చంపాడని ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ చెప్పారు. నిందితుడు రాణాను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ చెప్పారు. 


Updated Date - 2021-06-18T11:30:53+05:30 IST