అద్దె అడిగినందుకు ఇంటి యజమానిపై దాడి
ABN , First Publish Date - 2020-07-14T16:17:13+05:30 IST
ఇంటి అద్దె అడిగినందుకు యజమానిపై కిరాయిదారుడు దాడి చేశాడు. కుషాయిగూడ ఎస్ఐ అనంతాచారి కథనం ప్రకారం... కుషాయిగూడ వీఎన్ రెడ్డినగర్లో పల్లకూర వజ్రమ్మ ఇంటిలో
ఏఎస్ రావునగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఇంటి అద్దె అడిగినందుకు యజమానిపై కిరాయిదారుడు దాడి చేశాడు. కుషాయిగూడ ఎస్ఐ అనంతాచారి కథనం ప్రకారం... కుషాయిగూడ వీఎన్ రెడ్డినగర్లో పల్లకూర వజ్రమ్మ ఇంటిలో అల్వాల్ లోతుకుంటకు చెందిన దాల నిశ్చల్ ఎలియాస్ కార్తీక్ (24) తన భార్యతో కలిసి కొన్ని సంవత్సరాలుగా అద్దెకు నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల అద్దె ఇంటి యజమాని వజ్రమ్మకు బకాయి ఉన్నాడు. ఈ నెల 11న వజ్రమ్మ నిశ్చల్ భార్య చంద్రకళను అద్దెను అడిగింది. ఈ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇంటికి వచ్చిన నిశ్చల్కు జరిగిన సంఘటన గురించి చంద్రకళ తెలిపింది. ఆగ్రహానికి గురైన నిశ్చల్ వజ్రమ్మతో గొడవకు దిగారు. వజ్రమ్మ కుమారుడు సాయిల్గౌడ్పై కత్తితో దాడి చేయబోయాడు. సాయిల్గౌడ్ చేతి వేళ్లకు గాయాలు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిశ్చల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.