ఫొటోకు ఫోజిస్తూ.. 200ఏళ్లనాటి విగ్రహం వేలు విరగ్గొట్టిన టూరిస్ట్!

ABN , First Publish Date - 2020-08-06T04:31:55+05:30 IST

మ్యూజియానికి వచ్చిన ఓ టూరిస్టు.. అక్కడున్న ఓ విగ్రహంతో కలిసి ఫొటోకు ఫోజిచ్చాడు.

ఫొటోకు ఫోజిస్తూ.. 200ఏళ్లనాటి విగ్రహం వేలు విరగ్గొట్టిన టూరిస్ట్!

రోమ్: మ్యూజియానికి వచ్చిన ఓ టూరిస్టు.. అక్కడున్న ఓ విగ్రహంతో కలిసి ఫొటోకు ఫోజిచ్చాడు. ఆ సమయంలో పొరబాటున విగ్రహం కాలిబొటనవేలు విరగ్గొట్టాడు. దీన్ని గమనించి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఇటలీలోని ప్రఖ్యాత ఆంటోనియో కానోవా మ్యూజియంలో జరిగింది. ఇక్కడి ఓ 200ఏళ్లనాటి విగ్రహం వేలు విరిగినట్లు గమనించిన సిబ్బంది.. సీసీకెమెరా ఫుటేజిని పరిశీలించారు. దానిలో ఓ ఆస్ట్రేలియావాసి ఫొటోకు ఫోజిస్తూ విగ్రహం వేలు విరగ్గొట్టినట్లు గుర్తించారు. అయితే విషయాన్ని సిబ్బందికి చెప్పకుండా అతను పరారవడాన్ని మ్యూజియం ఉన్నతాధికారి తప్పుబట్టారు. ‘చేసిన తప్పుకు శిక్ష అనుభవించకుండా అతను స్వదేశానికి వెళ్లిపోకూడదు’ అని ఆయన అన్నారు.

Updated Date - 2020-08-06T04:31:55+05:30 IST